- రైతుల సంఘటితమే రైతు సమన్వయ సమితి లక్ష్యం
- రైతుబంధు లాంటి పథకం దేశంలో ఎక్కడాలేదు
- ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి
- రైతు సమన్వయ సమితి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరణ
- పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు
హైదారాబాద్, డిసెంబర్ 13(జనంసాక్షి): రైతుల సంఘటితమే రైతు సమన్వయ సమితుల లక్ష్యమని, రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ సమితుల ధ్యేయమని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని రైతు సమన్వయ సమితి కార్యాలయంలో సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి బాధ్యతలు స్వీకరించారను. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, నాయిని నర్సింహారెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ సంకల్పం అని అన్నారు. రైతుబంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని, రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులను సంఘటితం చేయడమే రైతు సమన్వయ సమితి లక్ష్యమని పల్లా తెలిపారు. తెలంగాణ 60శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు తమకు కూడా కావాలని ఇతర రాష్టాల్రు.. ఆయా ప్రభుత్వాలను అడుగుతున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ శరవేగంగా పూర్తి చేశారని పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 45వేల చెరువులలో పూడిక తీశామని, కోటీ 25 లక్షల ఎకరాలకు నీరివ్వడం ఖాయమన్నారు. ప్రస్తుతం రైతులు మార్కెట్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. పంటకు గిట్టుబాటు ధర రావడం కోసం మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని, ఏ పంట పండించాలి? ఎక్కడ అమ్ముకోవాలి? అనే అంశాలను రైతే నిర్దారించే విధంగా రైతు సమన్వయ సమితి కృసి చేస్తుందని వివరించారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల నిర్ణయాల కారణంగా వ్యవసాయ రంగం దెబ్బతిన్నదని, కేసీఆర్ సీఎం అయ్యాకే వ్యవసాయంపై అసక్తి చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 60శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, అందుకనుగుణంగా బ్జడెట్లో సగానికిపైగా నిధులను ఆ రంగానికే కేటాయించారని తెలిపారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్టాల్ర రైతులు అడిగే పరిస్థితి వచ్చిందని ప్రశంసించారు. కాళేశ్వరం ద్వారా నీళ్లు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నా లాభాలు రావాలంటే గిట్టుబాటు ధరలతో పాటు రైతులకు బేరమాడే శక్తి రావాలని అభిప్రాయపడ్డారు. హుజూర్నగర్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన పల్లా రాజేశ్వర్రెడ్డి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కూడా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయిని మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు అదృష్టవంతులని పేర్కొన్నారు. రైతుకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ రైతు లోకానికి ఆదర్శంగా నిలిచారన్నారు.