పోలీస్ స్టేషన్ అనేది ఒక సేవా కేంద్రంలాంటిది అనే భావన కల్గించాలి :
రామాయంపేట సి.ఐ. శ్రీ. డి. నాగార్జున్ గౌడ్
జనం సాక్షి మెదక్ బ్యూరో మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా యస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు జిల్లా లోని అన్నీ పోలీస్ స్టేషన్ల రిసెప్షనిస్ట్ ఆధికారులకు రిసెప్షన్ వర్టికల్ జిల్లా ఇంచార్జ్ అయిన రామాయంపేట సి.ఐ. శ్రీ. డి. నాగార్జున్ గౌడ్ గారు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా రామాయంపేట సి.ఐ. గారు మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులు/ సమాచారం/ సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి తగు సేవలు అందించడంలో రిసెప్షన్ అధికారి కీలకపాత్ర నిర్వహించాలని, పోలీస్ స్టేషన్ లకు వచ్చే ప్రతి పౌరుని యొక్క సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, తద్వారా వారి మనసులో భద్రతా భావాన్ని విశ్వాసాన్ని పెంపొందిస్తుంది, పోలీస్ స్టేషన్ అనేది ఒక సేవా కేంద్రం లాంటిది అనే భావన వారికి కలిగేలా ప్రవర్తిస్తూ స్టేషన్ లోని వివిధ అధికారులతో సమన్వయం చేసుకుని తగు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలందరికీ పోలీస్ వ్యవస్థ పై నమ్మకం విశ్వాసం కల్పించడంలో రిసెప్షన్ అధికారి ముఖ్య పాత్ర పోషించాలని తెలిపారు. రిసెప్షన్ అధికారి క్రమశిక్షణ సమయ పాలన వృత్తిపట్ల నిబద్ధత విధేయత కలిగి ఉండాలని ఎల్లప్పుడూ యూనిఫాంలో చురుకుగా ఉండి పెదాలపై నవ్వుతూ దరఖాస్తుదారుని ఆహ్వానించాలని, వ్యవహారాలను సమస్య పరిష్కారంలో పద్ధతుల ద్వారా సాధించగల విశ్లేషణాత్మక మరియు సంభాషణ నైపుణ్యాలు కలిగి ఉండి బాధ్యతలను నిర్వర్తించడంలో నిజాయితీ పారదర్శకత కలిగి ఉంటూ తన చర్యల పట్ల జవాబుదారీగా ఉండాలని సూచించారు, వృత్తి నిర్వహణకు సంబంధించిన చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండి వాటిలో జరిగే మార్పులపై నిరంతరము అవగాహన పెంచుకుని తన సామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని తెలిపారు. సాంకేతికత పై పూర్తి అవగాహన కలిగి ఉండి అవసరమైన సమయంలో తగిన రీతిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే దరఖాస్తుల్లో కేసు నమోదు చేయు ఫిర్యాదులు, సేవల కోసం వచ్చిన దరఖాస్తులు, మరియు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సంబంధించిన దరఖాస్తులు, సివిల్ విషయాలు, నాన్ కాగ్నిజబుల్ ఫిర్యాదులు మొదలగు వాటిని నమోదు చేసుకుని క్రమపద్ధతిలో వర్గీకరించి స్టేషన్లోని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ సహాయం అందునట్లు లేదా తగు చర్యలు తీసుకున్నట్లుగా సమన్వయం చేయాలని సూచించారు. ఫిర్యాదులను నేరుగా స్వీకరించాలి, దరఖాస్తు స్వీకరించేటప్పుడు ప్రతి దరఖాస్తులో నేరము జరిగిన తీరును గురించి ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలాజరిగింది, ఎందుకోసము జరిగినది. అనే విషయాలను ఖచ్చితంగా ఉండేటట్లు చూడవలసిన బాధ్యత రిసెప్షనిస్ట్ దేనని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన పిర్యాదిదారులని చూసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వారి సమస్య తీరుతుందని వారికీ భరోసా కల్పించి వారితో మాట్లాడి వారికి వీలైనంత తొందరగా న్యాయం చేయాలని సూచించారు. రిసెప్షనిస్ట్ గా ప్రతి దరఖాస్తు పై తప్పనిసరిగా పిటిషన్ మేనేజ్మెంట్ లో జనరేట్ చేసినా రిసిప్ట్ ఇవ్వాలని సూచించారు, మరియు వెంటనే సి.సి.టి.యన్.యస్ ప్రాజెక్టు ద్వారా పిటిషన్ మేనేజ్మెంట్ లో ఆన్ లైన్ ఎంటర్ చేయలని పిటిషన్ మరియు ఎంక్వయిరీ రిపోర్ట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. రిసెప్షన్ వద్ద మరియు పరిసర ప్రాంతాల్లో 5S విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు అదేవిధంగా సిస్టం, ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని తెలిపారు. పోలీస్ ఉద్యోగిగా ప్రజల సమస్యలను తీర్చగలిగే అవకాశం రావటం అదృష్టంగా భావించాలని అన్నారు, చట్టపరిధిలో విధి నిర్వహణ, మానవీయ కోణంలో ఆదరణ వంటి లక్షణాలు పోలీసు ఉద్యోగిని అత్యున్నత స్థాయిలో నిలబెడుతుందని అభివర్ణించారు. పోలీసు ఉద్యోగం అంటే అధికారం అని కాకుండా బాధ్యతని తెలుసుకుని డ్యూటీ చేయాలని తెలిపారు, మన పరిధిలో కాకుండా వేరే పరిధిలో నేరం జరిగినట్లు దరఖాస్తు వస్తే ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే దరఖాస్తు తీసుకుని రసీదు ఇవ్వాలి సూచించారు. ఆపరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ కు దరఖాస్తును బదలీ చేయలని సూచించారు. దీనివల్ల ప్రజలకు పోలీసు వ్యవస్థ ఫై మంచి అబిప్రాయం కలుగుతుందని తెలిపారు. మెదక్ జిల్లా ఇమేజ్ పెంచే బాధ్యత రిసెప్షన్ఈస్ట్ పై అదారపడి వున్నదని తెలిపారు. ప్రజలకు సేవ చేయడం మనకు దేవుడిచ్చిన గొప్ప అవకాశమని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు నీతి నిజాయితీతో విధులు నిర్వహించి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి.సి.ఆర్.బి. సి.ఐ. శ్రీ చందర్ రాథోడ్ గారు, జిల్లా ఐ.టి. కోర్ ఎస్.ఐ. ప్రభాకర్ గారు ఐ.టి. కోర్ సిబ్బంది అనిల్, సయీద్ మరియు జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ల రిసెప్షనిస్ట్ ఆధికారులకు లు పాల్గొన్నారు.