కేరళ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
తిరువనంతపురం,జనవరి 2 (జనం సాక్షి) : పౌరసత్వ అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని,దీనికి రాష్టాల్రకు హక్కు లేదని కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అంశంలో ఎటువంటి పాత్ర ఉండదన్నారు. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. సీఎం విజయన్ పాస్ చేసిన ఆ తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకమని గవర్నర్ తెలిపారు. దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉండదన్నారు. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ విూడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని తప్పుపట్టారు. కేరళలో ఎటువంటి నిర్బంధ కేంద్రాలు లేవని కూడా సీఎం విజయన్ అసెంబ్లీలో వెల్లడించిన విషయం తెలిసిందే.