మళ్లీ మళ్లీ నిజమవుతున్న ప్రీ పోల్ అంచనాలు జనంబాటే ' జనంసాక్షి' మాట... |
జనం నుండి వచ్చినం..జనంతోనే ఉంటం.. | || జనంబాటే జనంసాక్షి' మాటగా ఉంటుందని సగర్వంగా ప్రకటిస్తున్నాం .. నిష్పక్షపాత ఎన్నికల సర్వేలు నిర్వహించడం ద్వారా గతంలోనూ నిబద్ధతను చాటుకున్న 'జనంసాక్షి' తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని ముందే ప్రస్ఫుటంగా ప్రకటించి ఇప్పుడు మరోసారి సంచలనంగా మారింది. 'మున్సిపల్ లో కారుదే జోరు', 'తిరుగులేని టీఆర్ఎస్' అని పోలింగుకు ముందే జనంసాక్షి చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలైనాయి. రాష్ట్ర వ్యాప్త దృష్టిని ఆకర్షించిన రెండు ప్రధానమైన మున్సిపల్ కార్పొరేషన్లు ఒకటి నిజామాబాద్, రెండు కరీంనగర్. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎమ్మెఎమ్ సహకారంతో, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒంటరిగానే గులాబీ జెండా ఎగురుతుందని 'జనంసాక్షి' సాధికారికంగా ప్రకటించిన విషయమే నేడు వాస్తవ రూపం దాల్చింది. సర్వే ఫలితాలు మింగుడుపడని కొందరు మితృలు 'జనంసాక్షి' చిత్తశుద్ధిని ప్రశ్నించారు, వాళ్ళ ప్రశ్నలకు ఇప్పుడు ఆవిష్కృతమైన ఫలితాలే సమాధానం.