హైదరాబాద్,నవంబర్30(జనం సాక్షి): ప్రముఖ స్విమ్మర్ గోలి శ్యామలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. శ్యామల గోలి సెప్టెంబర్ 29 న యూఎస్ ఏ లోని కాటలినా ఐలాండ్ నుండి లాస్ ఏంజెల్స్ లోని మెయిన్ లాండ్ మధ్య గల జలసంధిని ఈది రికార్డు సృష్టించారు. మంగళవారం గోలి శ్యామల ఎమ్మెల్సీ కవితని హైదరాబాద్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. 32 కిలోవిూటర్లు గల ఈ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళగా శ్యామల నిలవడం సంతోషకరమన్నారు ఎమ్మెల్సీ కవిత. గోలి శ్యామల గతంలో భారత్ ? శ్రీలంకల మధ్యనున్న 30 మైళ్ల పాక్ జలసంధిని ( ఖజీ ªూబిసజీతిబి ) ఈదిన ప్రపంచ రెండవ మహిళగా రికార్డు సాధించారు. మధ్య తరగతికి చెందిన తనను ఎమ్మెల్సీ కవిత ఎంతగానో ప్రోత్సహించారని గోలి శ్యామల తెలిపారు.
స్విమమర్ గోలి శ్యామలకు కవిత అభినందనలు