హైదరాబాద్,డిసెంబర్10 జనంసాక్షి: సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీరియస్ అయ్యారు. ప్రజలు వినియోగిస్తున్న రహదారులను రైల్వే అధికారులు మూసివేసి ఇబ్బందులకు గురి చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. తమ బస్తీ నుంచి ఎన్నో సంవత్సరాలుగా రాకపోకలు సాగిస్తున్న రహదారిని ఎలా మూసివేస్తారని రైల్వే అధికారులను తలసాని ప్రశ్నించారు. మూసిన రహదారిని వెంటనే తెరవాలని టౌన్ ప్లానింగ్, పోలీసు అధికారులను ఆదేశించారు. ఇంత జరుగుతున్నా స్థానిక బీజేపీ నేతలు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరు మెదపరా? అని ప్రశ్నించారు. రైల్వే అధికారులు బస్తీ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే చర్యలను మానుకోవాలన్నారు.
బస్తీల్లో రహదారులు ఎలా మూస్తారు?రైల్వేపై మండిపడ్డ మంత్రి తలసాని